ETV Bharat / bharat

చిన్న పొరపాటుతో పెను విషాదం.. 9 మంది కూలీలు దుర్మరణం

author img

By

Published : Jun 26, 2022, 10:47 AM IST

Updated : Jun 26, 2022, 1:10 PM IST

Road Accident: రోజువారీ కూలీలతో వెళ్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఏడుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. అతివేగంతో వెళ్తూ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

7 People killed in accident Near belagavi
7 People killed in accident Near belagavi

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కూలీలతో వెళ్తున్న ఓ వాహనం రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఏడుగురు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కూలీలు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

స్థానికుల సహాయంతో వాహనం కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశామని పోలీసులు చెప్పారు. క్రూజర్ వాహనం అక్కాతంగియరహళ్ల గ్రామం నుంచి వెళ్తుండగా బెళగావి రహదారిలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కూలీలంతా బెళగావికి రోజువారీ పనుల కోసం వెళ్తున్నారని చెప్పారు. వాహనంలో 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు.

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కూలీలతో వెళ్తున్న ఓ వాహనం రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఏడుగురు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కూలీలు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

స్థానికుల సహాయంతో వాహనం కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశామని పోలీసులు చెప్పారు. క్రూజర్ వాహనం అక్కాతంగియరహళ్ల గ్రామం నుంచి వెళ్తుండగా బెళగావి రహదారిలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కూలీలంతా బెళగావికి రోజువారీ పనుల కోసం వెళ్తున్నారని చెప్పారు. వాహనంలో 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు.

ఇవీ చదవండి: ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

భారత వాయుసేన ఆవిర్భావం వెనుక ఆ నలుగురు!

Last Updated : Jun 26, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.