ETV Bharat / bharat

భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్​ సైన్యం

author img

By

Published : Nov 14, 2020, 5:00 AM IST

Updated : Nov 14, 2020, 5:58 AM IST

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శుక్రవారం ​జరిపిన కాల్పులకు దీటైన సమాధానం ఇచ్చింది భారత సైన్యం. పాక్​ స్థావరాలపై రాకెట్లతో దాడి చేసింది. శతఘ్నులు, క్షిపణులతో బదులిచ్చింది. పాక్ దుశ్చర్యకు మరణించిన భారతీయుల సంఖ్య 11కు చేరింది. మరోవైపు భారత్​ సైన్యం జరిపిన ప్రతి దాడిలో ఇప్పటివరకు 11మంది పాక్​ సైనికులు మరణించగా మరో 16మంది గాయపడ్డారు.

3 Army soldiers among eight killed in J&K
భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్​ సైన్యం

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలకు సన్నద్ధమవుతున్న వేళ పాక్​ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల మధ్య పాక్​ సైన్యం కాల్పులకు దిగింది. పౌరుల నివాసాలే లక్ష్యంగా మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడికి దిగింది.

11మంది భారతీయుల వీరమరణం

నియంత్రణ రేఖ వెంబడి దావర్, కేరన్‌, ఉరీ, నౌగమ్‌ సెక్టార్లలో మోర్టార్లు, తుపాకులతో పాక్​ సైన్యం దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడిలో ఇప్పటివరకు 11 మంది భారతీయులు మృతి చెందారు. వీరిలో ఒక సబ్​ఇన్​స్పెక్టర్​​, నలుగురు జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు.

సింహంలా గర్జించిన భారత సైన్యం

పాక్​ దుశ్చర్యకు భారత్​ సైన్యం సింహంలా గర్జించింది. పాక్​ స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించింది. ఆయుధాగారాలను, బంకర్లను ధ్వంసం చేసింది. ఆయుధ, చమురు డిపోలను ధ్వంసం చేసి పాకిస్థాన్​ సైన్యానికి తీరని నష్టం కలిగించింది. శతఘ్నులు, క్షిపణులతో భారత సైన్యం విరుచుకుపడింది. ఇప్పటివరకు 11మంది పాక్​ సైనికులు హతమయ్యారు. మరో 16మంది గాయపడ్డారు. కానీ పాకిస్థాన్​ మాత్రం 'కేవలం ఒక్క సైనికుడే మృతిచెందాడు, ఐదుగురు జవాన్లు గాయపడ్డార'ని వాదిస్తోంది.

పదే పదే

ఈ వారంలోనే పాక్​సైన్యం రెండోసారి దుశ్యర్యకు పాల్పడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 4,052సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

ఇదీ చదవండి :పాకిస్థాన్​ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలకు సన్నద్ధమవుతున్న వేళ పాక్​ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల మధ్య పాక్​ సైన్యం కాల్పులకు దిగింది. పౌరుల నివాసాలే లక్ష్యంగా మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడికి దిగింది.

11మంది భారతీయుల వీరమరణం

నియంత్రణ రేఖ వెంబడి దావర్, కేరన్‌, ఉరీ, నౌగమ్‌ సెక్టార్లలో మోర్టార్లు, తుపాకులతో పాక్​ సైన్యం దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడిలో ఇప్పటివరకు 11 మంది భారతీయులు మృతి చెందారు. వీరిలో ఒక సబ్​ఇన్​స్పెక్టర్​​, నలుగురు జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు.

సింహంలా గర్జించిన భారత సైన్యం

పాక్​ దుశ్చర్యకు భారత్​ సైన్యం సింహంలా గర్జించింది. పాక్​ స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించింది. ఆయుధాగారాలను, బంకర్లను ధ్వంసం చేసింది. ఆయుధ, చమురు డిపోలను ధ్వంసం చేసి పాకిస్థాన్​ సైన్యానికి తీరని నష్టం కలిగించింది. శతఘ్నులు, క్షిపణులతో భారత సైన్యం విరుచుకుపడింది. ఇప్పటివరకు 11మంది పాక్​ సైనికులు హతమయ్యారు. మరో 16మంది గాయపడ్డారు. కానీ పాకిస్థాన్​ మాత్రం 'కేవలం ఒక్క సైనికుడే మృతిచెందాడు, ఐదుగురు జవాన్లు గాయపడ్డార'ని వాదిస్తోంది.

పదే పదే

ఈ వారంలోనే పాక్​సైన్యం రెండోసారి దుశ్యర్యకు పాల్పడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 4,052సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

ఇదీ చదవండి :పాకిస్థాన్​ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం

Last Updated : Nov 14, 2020, 5:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.