ETV Bharat / bharat

రిపబ్లిక్ డే రోజున నక్సల్స్ లొంగుబాటు

author img

By

Published : Jan 27, 2021, 4:46 AM IST

రిపబ్లిక్ డే రోజున ఛత్తీస్​గఢ్​లో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ముందుకొచ్చారు. వీరు లొంగిపోయిన ప్రదేశంలోనే పోలీసులు గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
రిపబ్లిక్ డే రోజున నక్సల్స్ లొంగుబాటు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం 24 మంది మావోయిస్టులు ఛత్తీస్​గఢ్​లోని నక్సల్​గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. రాష్ట్రంలో చేపట్టిన 'లోన్ వరట్టు' పథకం కింద వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
జాతీయ పతాకానికి సెల్యూట్

ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయిన ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవం నిర్వహించారు పోలీసులు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నక్సల్స్​తో కలిసి జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బంది స్టెప్పులేశారు. చప్పట్లు కొడుతూ వారితో ఆడిపాడారు.

24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
నక్సల్స్​తో చిందులేసిన ఎస్పీ
24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
చిన్నారులతో నృత్యం చేస్తున్న పోలీసు సిబ్బంది
24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
రిపబ్లిక్ డే రోజున నక్సల్స్ లొంగుబాటు

లొంగిపోయిన నక్సలైట్లలో ముగ్గురిపై రూ. లక్ష రివార్డు ఉందని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. లోన్​ వరట్టు కార్యక్రమంలో భాగంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. గతేడాది 225 మంది నక్సల్స్​ లొంగిపోగా.. వీరందరికీ వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. నక్సల్స్ ధ్వంసం చేసిన రోడ్లు, బడులు, బ్రిడ్జిల పునర్నిర్మాణంలో వీరికి పని కల్పించినట్లు తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం 24 మంది మావోయిస్టులు ఛత్తీస్​గఢ్​లోని నక్సల్​గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. రాష్ట్రంలో చేపట్టిన 'లోన్ వరట్టు' పథకం కింద వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
జాతీయ పతాకానికి సెల్యూట్

ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయిన ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవం నిర్వహించారు పోలీసులు. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నక్సల్స్​తో కలిసి జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బంది స్టెప్పులేశారు. చప్పట్లు కొడుతూ వారితో ఆడిపాడారు.

24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
నక్సల్స్​తో చిందులేసిన ఎస్పీ
24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
చిన్నారులతో నృత్యం చేస్తున్న పోలీసు సిబ్బంది
24-naxalites-surrender-during-republic-day-program-in-dantewada
రిపబ్లిక్ డే రోజున నక్సల్స్ లొంగుబాటు

లొంగిపోయిన నక్సలైట్లలో ముగ్గురిపై రూ. లక్ష రివార్డు ఉందని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. లోన్​ వరట్టు కార్యక్రమంలో భాగంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. గతేడాది 225 మంది నక్సల్స్​ లొంగిపోగా.. వీరందరికీ వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. నక్సల్స్ ధ్వంసం చేసిన రోడ్లు, బడులు, బ్రిడ్జిల పునర్నిర్మాణంలో వీరికి పని కల్పించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.