ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య నగరాల్లో 22 భారత్లోనే ఉన్నాయి. అత్యంత కాలుష్యమైన రాజధానుల జాబితాలో దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఈ మేరకు ఓ నివేదికలో తేలింది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఏయిర్ అనే సంస్థ 'ప్రపంచ వాయు నాణ్యత 2020' పేరుతో ఈ నివేదికను వెలువరించింది.
అత్యంత కాలుష్య నగరాల జాబితాలో దిల్లీ 10వ స్థానంలో ఉందని నివేదిక చెప్పింది. అయితే.. దిల్లీలో వాయు నాణ్యత 2019తో పోలిస్తే 2020లో 15 శాతం పెరిగిందని పేర్కొంది.
నివేదికలోని కీలకాంశాలు..
- ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో చైనాలోని షింజియాంగ్ ప్రథమ స్థానంలో ఉండగా.. మిగతా 9 నగరాలు భారత్లో ఉన్నాయి.
- షింజియాంగ్ తర్వాత ఘాజియాబాద్ రెండో స్థానంలో ఉంది.
భారత్లోని 21 అత్యంత కాలుష్య నగరాలు..
ఘాజియాబాద్, బులంద్షహర్, బిస్రాఖ్ జలాల్పుర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పుర్, లఖ్నవూ, మేరఠ్, ఆగ్రా, ముజఫర్నగర్, భివారి, ఫరీదాబాద్, జింద్, హిసార్, ఫతేహాబాద్, బంద్వారీ, గురుగ్రామ్, యమునా నగర్, రోహ్తక్, ధరుహోరా, ముజఫర్పుర్.
రవాణా, కట్టెలపొయ్యి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణాలు, వ్యర్థాల దహనం వంటివి భారత్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలని నివేదిక చెప్పింది.
106 దేశాల నుంచి అందిన పీఎం 2.5 డేటా ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను వెలువరించారు.
ఇదీ చూడండి:ఉగ్రవాదం వైపు యువత.. అడ్డుకున్న పోలీసులు