చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) విజృంభిస్తోంది. రాజస్థాన్ పాలీ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఈ శిలీంధ్ర వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ.. జోధ్పుర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
పాలీ జిల్లా సర్గోవాలా ఆరత్కు చెందిన 35 ఏళ్ల యువకుడికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించగా.. జోధ్పుర్ ఎయిమ్స్లో శుక్రవారం చేరాడు. శనివారం రాత్రి అతడు చికిత్స పొందుతూ మరణించాడు. సమేర్పుర్ కోలివాడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి మే 15న ఎయిమ్స్లో చేరాడు. శనివారం ఉదయం ఆయనా ప్రాణాలు కోల్పోయాడు.
బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో పాలీ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షణాలు కనిపించిన వెంటనే.. చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య