ETV Bharat / bharat

గూడ్స్​ రైలు ఢీకొని.. రెండు గజరాజులు మృతి - ఒడిశాలో ఏనుగుల మృతి వార్త

ఒడిశాలో రైలు ట్రాకు దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్​ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో ఏనుగులు అక్కడికక్కడే మరణించాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2 Elephants Killed After Being Hit By Train
గూడ్స్​ రైలు ఢీకొట్టి.. రెండు ఏనుగులు మృతి
author img

By

Published : Feb 4, 2021, 7:09 PM IST

ఒడిశా సుందర్​గఢ్​ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో రెండు ఏనుగులు మృతి చెందాయి. బిర్సా ప్రాంతంలోని మహిపాని వద్ద బుధవారం రాత్రి ట్రాక్ దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్​ రైలు ఢీకొట్టగా.. ఈ ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడం వల్ల.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2 Elephants Killed After Being Hit By Train
పట్టాలు పక్కనే పడిఉన్న ఏనుగు కళేబరం
2 Elephants Killed After Being Hit By Train
మృతి చెందిన మరో ఏనుగు చుట్టూ గుమిగూడిన స్థానికులు

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. ఏనుగుల కళేబరాలను తొలగించి ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

ఒడిశా సుందర్​గఢ్​ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో రెండు ఏనుగులు మృతి చెందాయి. బిర్సా ప్రాంతంలోని మహిపాని వద్ద బుధవారం రాత్రి ట్రాక్ దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్​ రైలు ఢీకొట్టగా.. ఈ ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడం వల్ల.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2 Elephants Killed After Being Hit By Train
పట్టాలు పక్కనే పడిఉన్న ఏనుగు కళేబరం
2 Elephants Killed After Being Hit By Train
మృతి చెందిన మరో ఏనుగు చుట్టూ గుమిగూడిన స్థానికులు

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. ఏనుగుల కళేబరాలను తొలగించి ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.