ETV Bharat / bharat

20 నిమిషాల్లో 17 కిలోల బంగారం చోరీ!

author img

By

Published : Jul 17, 2021, 3:56 PM IST

Updated : Jul 17, 2021, 10:23 PM IST

మణప్పురమ్​ గోల్డ్​ లోన్​ కార్యాలయంలో సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీ చేశారు దుండగులు. 20 నిమిషాల్లోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షలు లూటీ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో జరిగింది.

Manappuram gold
మణప్పురం కార్యాలయంలో చోరీ

సినీఫక్కీలో దుండగులు మణప్పురం గోల్డ్​ లోన్​ కార్యాలయంలో దోపిడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు లూటీ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని కమలా నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దోపిడి జరిగింది.

శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆరుగురు దుండగులు తుపాకులతో కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని బెదిరించి.. 20 నిమిషాల్లోనే మొత్తం లూటీ చేశారు. పారిపోయే క్రమంలో సిబ్బందిని లోపలే ఉంచి తాళం వేశారు. కొందరు అలారం​ మోగించగా.. చుట్టుపక్కల వారు వచ్చి గేట్​ తెరిచారు.

Gold robbery
బంగారం చోరీ

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏడీజీ రాజీవ్​ క్రిష్ణ, ఐజీ నవీన్​ అరోరా, ఎస్​ఎస్​పీ సహా ఇతర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించారు.

ఎత్మాదపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖందౌలీ రోడ్​ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకోగా వారిపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, దుండగుల మధ్య జరిగిన కాల్పుల్లో మనీశ్​ పాండే, కుమార్​ అనే వ్యక్తులకు తూటాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. వారి నుంచి రెండు తుపాకులు, లూటీ చేసిన సగం సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​కౌంటర్​ నుంచి నరేంద్ర అలియాస్​ లాల్​, అన్షులు తప్పించుకుని పారిపోయారు.

ఇదీ చూడండి: వైద్యరంగంలో నూతన పోకడలు.. కశ్మీర్‌లో శిక్షణ శిబిరం

సినీఫక్కీలో దుండగులు మణప్పురం గోల్డ్​ లోన్​ కార్యాలయంలో దోపిడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు లూటీ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని కమలా నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దోపిడి జరిగింది.

శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆరుగురు దుండగులు తుపాకులతో కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని బెదిరించి.. 20 నిమిషాల్లోనే మొత్తం లూటీ చేశారు. పారిపోయే క్రమంలో సిబ్బందిని లోపలే ఉంచి తాళం వేశారు. కొందరు అలారం​ మోగించగా.. చుట్టుపక్కల వారు వచ్చి గేట్​ తెరిచారు.

Gold robbery
బంగారం చోరీ

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏడీజీ రాజీవ్​ క్రిష్ణ, ఐజీ నవీన్​ అరోరా, ఎస్​ఎస్​పీ సహా ఇతర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించారు.

ఎత్మాదపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖందౌలీ రోడ్​ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకోగా వారిపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, దుండగుల మధ్య జరిగిన కాల్పుల్లో మనీశ్​ పాండే, కుమార్​ అనే వ్యక్తులకు తూటాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. వారి నుంచి రెండు తుపాకులు, లూటీ చేసిన సగం సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎన్​కౌంటర్​ నుంచి నరేంద్ర అలియాస్​ లాల్​, అన్షులు తప్పించుకుని పారిపోయారు.

ఇదీ చూడండి: వైద్యరంగంలో నూతన పోకడలు.. కశ్మీర్‌లో శిక్షణ శిబిరం

Last Updated : Jul 17, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.