ETV Bharat / bharat

11 మంది సర్కారీ ఉద్యోగులపై వేటు

author img

By

Published : Jul 10, 2021, 7:07 PM IST

జమ్ము కశ్మీర్​లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో వీరిని విధుల్లోంచి తొలగించింది అక్కడి యంత్రాంగం.

JK GOVT EMPLOYEES DISMISSED
జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్ము కశ్మీర్​లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై అక్కడి యంత్రాంగం కొరడా ఝులిపించింది. వీరందరినీ విధుల నుంచి తొలగించింది.

వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 మందిలో ఇందులో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.. ఉగ్రవాదులకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారని వివరించారు. ఎలాంటి విచారణ అవసరం లేకుండా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వీరిని తొలగించినట్లు చెప్పారు.

వేటు పడిన 11 మంది ఉద్యోగులలో అనంతనాగ్ జిల్లా నుంచి నలుగురు, బుద్గాం నుంచి ముగ్గురు, బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యా శాఖలో నలుగురు, జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో ఇద్దరు, వ్యవసాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ, స్కిమ్స్, వైద్య శాఖలో ఒక్కొక్కరు పనిచేస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి: రూ.2,500 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్​

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్ము కశ్మీర్​లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై అక్కడి యంత్రాంగం కొరడా ఝులిపించింది. వీరందరినీ విధుల నుంచి తొలగించింది.

వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 మందిలో ఇందులో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.. ఉగ్రవాదులకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారని వివరించారు. ఎలాంటి విచారణ అవసరం లేకుండా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వీరిని తొలగించినట్లు చెప్పారు.

వేటు పడిన 11 మంది ఉద్యోగులలో అనంతనాగ్ జిల్లా నుంచి నలుగురు, బుద్గాం నుంచి ముగ్గురు, బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యా శాఖలో నలుగురు, జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో ఇద్దరు, వ్యవసాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ, స్కిమ్స్, వైద్య శాఖలో ఒక్కొక్కరు పనిచేస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి: రూ.2,500 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.