thumbnail

By

Published : Jul 8, 2020, 9:26 PM IST

ETV Bharat / Videos

ప్రతిధ్వని: ఆన్​లైన్ క్లాసులు.. అమెరికా ఆంక్షలు

అమెరికా విశ్వవిద్యాలయాలు ఆన్​లైన్ మాధ్యమానికి మారినట్లైతే.. విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాలని ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేదా.. క్యాంపస్ లో తరగతులు బోధించే విశ్వ విద్యాలయాలకైనా బదిలీ కావాలని అమెరికా ఇమిగ్రేషన్ విభాగం సూచించింది. ఆన్​లైన్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వీసాలు మంజూరు చేయబోమని తెగేసి చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. రాబోయే సెమిస్టర్​ను ఆన్​లైన్​లో నిర్వహించాలని ఇటీవల హార్వర్డ్ సహా.. చాలా విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ కారణంగా.. అమెరికాలో చదువుతున్న దాదాపు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులకు కష్టాలు ఆరంభమయ్యాయి. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం 3 లక్షల 60 వేల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు.. భారతీయ విద్యార్థుల్లో ఉన్న ఆందోళనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.