thumbnail

వెలవెలబోయిన వైసీపీ సామాజిక సాధికార సభ - ఖాళీ కుర్చీల మధ్యే మంత్రి ప్రసంగం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 6:46 PM IST

YSRCP Samajika Sadhikara Bus Yatra: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన సాధికారత బస్సు యాత్రకు ప్రజలు కరవయ్యారు. బస్సు యాత్ర సభకు ప్రజలు లేక సభ వెలవెల పోయింది. చెన్నూరు- కొండపేట వంతెనపైన వైసీపీ సాధికారత బస్సు యాత్ర సభ నిర్వహించారు. ఇందులో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సభ ఉంటుందని నాయకులు బలవంతంగా సభ ప్రాంగణానికి ప్రజలను తీసుకొచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం అయింది. వైసీపీ నాయకులు ప్రసంగం ప్రారంభించగానే సభా ప్రాంగణం నుంచి మహిళలు వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీల మధ్యే మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రసంగం సాగింది.

కేవలం పదుల సంఖ్యలో అక్కడక్కడ కనిపించిన జనానికి మాత్రమే నేతల ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వంతెన పొడవునా భారీ స్థాయిలో కుర్చీలు వేసినప్పటికీ అవన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇవ్వడంపై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. సభలో నేతల ప్రసంగాలు పూర్తి కాకుండానే ప్రజలంతా ఇంటి దారి పట్టారు. మరోవైపు చెన్నూరు -కొండపేట వంతెనను ఉదయం నుంచి దిగ్బంధం చేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.