వైసీపీలో వర్గపోరు- విజయనగరంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం - CM JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 10:12 PM IST

YSRCP Leaders Meeting Against Srungavarapu Kota MLA: విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు రాజుకుంది. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఓ కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఐదు మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయుకులు తమ ఆవేదనని వెలిబుచ్చారు. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా, ద్వితీయ శ్రేణి నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీతో నాకు పనేముంది అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహరించారని సమావేశంలో వాపోయారు. 

ప్రజల్లో కడుబండి శ్రీనివాసరావుపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఈసారి కడుబంటికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని, తప్పనిసరిగా మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. స్థానికుల్లో ఎవ్వరికి సీటు ఇచ్చినా పర్వాలేదన్నారు. అలా కాకుండా మరోసారి కడుబండి శ్రీనువాసురావుకు అధిష్ఠానం టికెట్ ఇస్తే ఐదు మండలాలు నాయుకులు అందరం కలిసి పార్టీకి రాజీనామా చేసేందుకైనా సిద్ధమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.