thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 5:16 PM IST

ETV Bharat / Videos

ప్రకాశం జిల్లా వైసీపీలో ముదురుతున్న వివాదం - నూతన ఇన్​ఛార్జ్ ఫ్లెక్సీల చించివేత

YSRCP Leaders Flexi Controversy: నియోజకవర్గాల ఇన్​ఛార్జిల మార్పుతో వైసీపీలో మొదలైన తీవ్ర అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నూతన ఇన్​ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్, ఇప్పటి వరకూ ఇన్​ఛార్జ్​గా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నూతనంగా వచ్చిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్​ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి సురేష్ అతిథి గృహానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. సీసీ కెమెరాలు లేనిచోట మాత్రమే ఫ్లెక్సీలు చించేశారు. కావాలనే చేశారని ఇన్​ఛార్జ్ చంద్రశేఖర్‌ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కాదని ఇటీవల తాడిపత్రి చంద్రశేఖర్‌ను నియోజకవర్గ వైసీపీ ఇన్​ఛార్జ్​గా అధిష్ఠానం నియమించింది.  

మరోవైపు తాటిపత్రి చంద్రశేఖర్ నిర్వహించే సమావేశాలకు సైతం మంత్రి సురేష్ మద్దతు దారులు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ నాయకులతో తాడిపత్రి చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సురేష్ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరూ హాజరు కాలేదు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.