Vishaka Ukku Rakshana Yatra: విశాఖలో ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం.. మొదలైన 'ఉక్కు రక్షణ యాత్ర'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 7:54 PM IST

thumbnail

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఉక్కు రక్షణ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 1050కిలోమీటర్ల మేర ఈ బైక్ యాత్ర కొనసాగనుంది. 'ఉక్కు రక్షణ యాత్ర'లో (Ukku Rakshana Yatra)  సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. వైసీపీ (YCP) ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా కృషి చేస్తుందా.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆంకాంక్షలను వమ్ము చేస్తుందా... తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు బాధ్యత వహించని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాయిని హెచ్చరించారు. ఈ యాత్ర ఈనెల 29వ తేదీన ఉక్కు కర్మాగారం ఎదుట బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు.  ఈ సభకు అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.