thumbnail

తుంగభద్రకు పోటెత్తుతున్న వరద.. దిగువకు నీటి విడుదల

By

Published : Jul 19, 2022, 4:34 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

TUNGABHADRA: తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 38 ఏళ్లలో తొలిసారిగా జలాశయానికి ముందస్తు ప్రవాహం వస్తుందని బోర్డు సెక్రటరీ నాగమోహన్ తెలిపారు. దీంతో నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలలో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. డ్యామ్​కి ప్రస్తుతం 1.67లక్షల కూసెక్కుల వరద నీరు వస్తుండగా.. వచ్చిన నీటిని 32 గేట్ల ద్వారా వదులుతూనే.. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్​కు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ వరద మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని కర్ణాటక అధికారుల నుంచి తుంగభద్ర అధికారులకు, డ్యామ్ బోర్డుకు సమాచారం అందింది.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.