By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 8:20 PM IST
పామర్రులో ఉద్రిక్తత - బ్యానర్లు తొలగించారని టీడీపీ ఆందోళన - అడ్డుకున్న పోలీసులు
Tension in Pamarru Over Removal of TDP flexis: కృష్ణా జిల్లాలో టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన టీడీపీ ఫ్లెక్సీలను వెంటనే ఏర్పాటు చేయాలని నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పామర్రులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ కట్టిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడంతో తెలుగుదేశం పామర్రు పార్టీ బాధ్యులు కుమార్ రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలగించిన ఫ్లెక్సీలను వెంటనే కట్టాలని.. లేకపోతే తామే ఏర్పాటు చేసుకుంటామని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఏమిటి అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన బ్యానర్లు అన్నిటినీ ఉంచి.. కేవలం తెలుగుదేశం పార్టీ బ్యానర్లు తొలగించడంపై తీవ్ర నిరసన తెలిపారు. టీడీపీ నేతలు తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అక్కడ పామర్రు, గుడివాడ డివిజన్ పోలీసులు భారీగా మెహరించారు.