thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 9:59 PM IST

ETV Bharat / Videos

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: బీటెక్ రవి

BTech Ravi participated in Babu Surety Bhavishyathuku Guarantee: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. పులివెందులలో భరత్ అనే వ్యక్తి లైసెన్స్ పిస్టల్​తో దిలీప్ అనే యువకుడిని కాల్చి చంపాడని, ఈ ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని రవి ఆరోపించారు.

అంతకుముందే తుమ్మలపల్లి చెందిన విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని భరత్ యాదవ్ బెదిరించే సమయంలో ఒక బుల్లెట్ వేస్ట్ అయిందని, ఆ బుల్లెట్ కాని ఉంటే ఆ ఘర్షణలో మహబూబ్ బాషా అనే వ్యక్తి కూడా మృతి చెంది ఉండేవాడని అన్నారు. హత్య చేసినట్లు సీసీ ఫుటేజీలో క్లియర్​గా ఉన్నా అతనికి బెయిల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి బెయిల్​కు పోలీసులు సహకరించారంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే పోలీసుల పాత్ర బాగుండాలని బీటెక్ రవి హితవు పలికారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.