రెండు నెలల సమయం ఎలా సరిపోతుంది - గ్రూప్​ 2 నోటిఫికేషన్​పై అశోక్​ బాబు ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 6:52 PM IST

thumbnail

TDP Ashok Babu on APPSC Group 2 Notification: జగన్ రెడ్డి ప్రభుత్వమిచ్చిన గ్రూప్ -2 నోటిఫికేషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిందేనని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఎలా ఉద్యోగాలు సాధిస్తారో జగన్ చెప్పాలన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారో, ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారో కూడా ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేసే సదుద్దేశం జగన్​కు ఉంటే గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు 4 నెలల సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

నాలుగున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలను జగన్ రెడ్డి భర్తీ చేశారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం ఇవ్వకపోవడం ముమ్మాటికీ నిరుద్యోగుల్ని వంచించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. యువత చైతన్యమైతే తనను నిలదీస్తుందన్న భయంతో వారిని గంజాయి, కల్తీమద్యం, ఇతర మాదకద్రవ్యాలకు బానిసల్ని చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి మోసపు మాటలు నమ్మిన యువతలో దాదాపు 1500 మంది నాలుగేళ్లలో ఉపాధిలేక బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.