TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు.. - TDP committee for coordination with Janasena
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-10-2023/640-480-19775410-thumbnail-16x9-tdp-janasena.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 9:11 PM IST
TDP-JanaSena Coordination Committee: రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలన్నదే లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకోసమే వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించిన పవన్ (Pavan Kalyan).. రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ సందర్భంగా పొత్తును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జత కలిసే వైసీపీని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యాన పొత్తు బంధాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా తెలుగుదేశం-జనసేన నాయకులు అడుగులు వేస్తున్నారు.
జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యలు ఉన్నారు. తెలుగుదేశం- జనసేన కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కమిటీ సమన్వయం చేయనుంది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండాగా రెండు పార్టీలు పని చేయనున్నాయి.