thumbnail

By

Published : Apr 5, 2023, 10:44 PM IST

ETV Bharat / Videos

హిందూపురంలో తమిళుల నగరోత్సవం.. ఆ విన్యాసాలు చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

మండుటెండలో... ఒంటినిండా ఇనుప చువ్వలు గుచ్చుకొని నగరోత్సవం నిర్వహించడం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. దశాబ్దాల కాలం క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి.. హిందూపురం పట్టణంలోని పలని నగర్, ఇందిరానగర్​లో స్థిరపడ్డ తమిళులు.. తర తరాలుగా వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. తంగుని నక్షత్రం.. చైత్ర శుద్ధ పౌర్ణమి ముందురోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడం వీరి ఆనవాయితీ. కోరిన కోర్కెలు నెరవేరాలన్నా.. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒంటినిండా ఇనుప చువ్వలు గుచ్చుకొని ఇందిరా నగర్​లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి నగరోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఇలా చేస్తే ఆయురారోగ్యాలతో ఉంటూ వారి కుటుంబానికి సకల శుభాలు జరుగుతాయని వారి నమ్మకం. మండుటెండలో పెద్ద పెద్ద వాహనాలకు వేలాడుతూ ఒళ్ళు గగుర్పాటు కలిగే విధంగా పట్టణంలో నగర ఉత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీదా వస్తోందని చెప్తున్నారు. ఇలా చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనికరించి తాము కోరిన కోర్కెలు నెరవేరుస్తారని అంటున్నారు.. హిందూపురం పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీ నగర్ వాసులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.