Prathidhwani: ఏపీలో కేజీఎఫ్ సినిమా సీన్లు..! ప్రైవేటు సైన్యం నీడలో ఇసుక రిచ్​లు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 11:04 PM IST

thumbnail

Prathidhwani: ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పర్యావరణాన్ని సర్వనాశనం చేసేలా అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ప్రతి రీచ్‌ ఒక చిన్న సైజు కేజీఎఫ్‌ సినిమాను తలపిస్తోంది. చాలా చోట్ల ప్రైవేటు సైన్యాన్ని కాపలా పెట్టుకుని, బయటి వ్యక్తులు ఎవరూ రీచ్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వం అండతో సాగుతున్న ఈ ఇసుక తవ్వకాల వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలుగుతోంది? దాని పర్యవసానాలు రాష్ట్ర ప్రజలపై ఎలా ఉంటాయి?  పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించటం, దాని మీద రాష్ట్రప్రభుత్వం స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లగా సుప్రీం కోర్టు కూడా స్టేకు నిరాకరించటం తెలిసిందే. ఏపీలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం జాతీయ స్థాయికి వెళ్లేంత తీవ్రంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయా? ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ నిషేధం విధించినా, సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించినా ఏపీలో ఇసుక మాఫియా తవ్వకాలు ఆపట్లేదు. వాళ్లకు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది? అనేదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.