నేటితో ముగియనున్న లోకేశ్ యువగళం పాదయాత్ర - 20న విజయోత్సవ సభ - యువగళం విజయోత్సవ సభ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 12:45 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra in Visakha: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ వెంట తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కదం కలిపారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా నిర్వాహకులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద స్టీల్ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ కానున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది.
విశాఖ శివాజీనగర్లో పాదయాత్ర ముగింపు సందర్బంగా లోకేశ్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. యువగళం పాదయాత్ర కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మెుత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్ నడిచారు. అన్ని జిల్లాల్లో ప్రజలు యువగళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ(Yuvagalam Vijayotsava Sabha) నిర్వహించనున్నారు.