ఆ తహశీల్దార్ అధికార పార్టీకి తొత్తుగా మారి అవినీతితో కోట్లు గడించాడు: కడప భూరక్షణ కమిటీ నేతలు - శివరామిరెడ్డి తహశీల్దార్ అక్రమాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-11-2023/640-480-20001797-thumbnail-16x9-mro-corruption-in-ysr-kadapa-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 7:41 PM IST
MRO Corruption in YSR Kadapa District: వైఎస్సార్ కడప జిల్లాలో ఓ తహశీల్దార్ భారీ కుంభకోణాల్లో పాలు పంచుకున్నాడని.. కడప భూ రక్షణ కమిటీ నాయకులు ఆరోపణలు చేశారు. దాదాపు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కచోటే విధులు నిర్వహిస్తూ.. అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టుతున్నారని వారు మండిపడ్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ పేదల స్థలాలను సైతం స్వహా చేస్తూ కోట్ల రూపాయలు గడించారని వారు అంటున్నారు.
అసలేంజరిగిందంటే.. నాలుగున్నర సంవత్సరాల క్రితం గత ఎన్నికలకు ముందు శివరామిరెడ్డి అనే తహశీల్దార్ కడపకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారరని కడప భూ రక్షణ కమీటి నాయకులు నారాయణ రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని ఉటుకూరు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఓ శాసనసభ్యుని పేరు మీదకు బదలాయించారని విమర్శించారు. కొన్ని రోజులుగా రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వకుంట స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి మామకు బదలాయించారని అన్నారు. అధికార పార్టీ నేతలకు స్థలాలు కట్టబెట్టడం వల్లే అతనికి బదిలీ చేయించడం లేదనే విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. తాహశీల్దార్ వల్ల నష్టపోయిన రైతులతో ఈ నెల 26వ తేదీన కడప ప్రెస్క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.