thumbnail

'నాలుగున్నరేళ్లు అవుతున్నా నీళ్ల కష్టాలు తీర్చలేకపోయారే! ఎందుకొచ్చారు? ' - వైసీపీ నేతకు చేదు అనుభవం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 2:55 PM IST

CPI leaders And People Tell local issues In Sambasiva Reddy: ప్రభుత్వ విద్యా సలహాదారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డిని సీపీఐ నేతలు, కాలనీవాసులు స్థానిక సమస్యలపై నిలదీశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామపంచాయతీలోని రాఘవేంద్ర కాలనీలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీలో మురుగునీటి సమస్య, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ వంటి స్థానిక సమస్యలపై కాలనీవాసులు, సీపీఐ నాయకులు సాంబశివారెడ్డిని నిలదీశారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతున్నా కాలనీలోని సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీలో ఇప్పటికీ అంగన్​వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు మండిపడ్డారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయనకు తెలియజేశారు. ప్రజల సమస్యలు విన్న ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి... తొందరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెబుతూ అక్కడ నుంచి ముందుకు కదిలారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.