హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ - పరస్పరం రాళ్ల దాడులతో బెంబేలెత్తిన స్థానికులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 9:37 PM IST

thumbnail

Clashes Between Transgenders Groups in Nandyala District : నంద్యాల జిల్లా పాణ్యంలో రెండు హిజ్రా గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా రెండు హిజ్రాల గ్రూపుల మధ్య వివాదం జరగ్గా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇందు, హసీనా గ్రూపుల మధ్య ఈ వివాదం గత కొన్ని రోజులుగా ఉంది. తాజాగా ఈ వివాదం రెండు వర్గాల మధ్య రెట్టింపై ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరువురు దాడులు చేసుకోవడంతో  బస్‌స్టాండ్‌ సమీపంలోని బీసి కాలనీ వాసులు భయాందోళనకు గురైయ్యారు. 

Attacks Between Two Transgenders Groups in Panyam : విషయం తెలుసుకున్న నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని హిజ్రా గ్రూపులతో మాట్లాడారు. గొడవలకు కారణమైన నలుగురిని పోలీస్ స్టేషన్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద సంఖ్యలో హిజ్రాలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు పెంచి వారిని తమ స్వస్థలాలకు వెళ్లమని ఆదేశించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.