సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్పై విచారణ వాయిదా
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 2:47 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-11-2023/640-480-20028759-thumbnail-16x9-cbi-court-on-viveka-case-approver-dastagiri-petition.jpg)
CBI Court on Viveka Case Approver Dastagiri petition: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి.. సాక్షిగా పరిగణించాలని దస్తగిరి గతవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
Dastagiri Petition in CBI court: కానీ ఇవాళ మిగతా నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేయలేదు. కాస్త సమయం కావాలని కోర్టును కోరడంతో.. దీనిపై విచారణను ఈ నెల 20కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)లో దస్తగిరి ఏ-4 నిందితుడిగా ఉన్నారు. అప్రూవర్గా మారడంతో మొదటి ఛార్జిషీట్లో సీబీఐ అధికారులు తన పేరును సాక్షిగా చేర్చారని.. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని దస్తగిరి పిటిషన్(Dastagiri Petition)లో కోరారు.