Attack on Pastor: పాస్టర్ల మద్య ఘర్షణ.. పాస్టర్​, అతని భార్యపై మరో వర్గం దాడి! - చర్చి పాస్టర్​పై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2023, 6:33 PM IST

Attack on Pastor: గుంటూరు జిల్లా పొన్నూరు అంబేడ్కర్ కాలనీలోని ఏఈఎల్​సీ చర్చిలో పాస్టర్ల మద్య ఘర్షణ కలకలం రేపింది. ఆంధ్ర లూథరన్ ఇవాంజెలికల్ చర్చి తూర్పు గుంటూరు అధ్యక్షుడు ఉత్తర్వుల మేరకు బదిలీపై వెంకటరత్నం అంబేడ్కర్ కాలనీలోని ఏఈఎల్​సీ చర్చిలో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాస్టర్ టైటాస్ దేవకుమార్, పాస్టర్ మిక్కిలి పాల్ ప్రసాద్ కొందరు అనుచరులతో వెంకటరత్నం, అతని భార్యపై మూకుమ్మడిగా దాడి చేశారు. పాస్టర్​ వెంకటరత్నంను బయటకు వెళ్లగొట్టారు. 

దీనిపై ఏఈఎల్​సీ అధ్యక్షుడు కనపర్తి ఆశీర్వాదానికి వెంకటకరత్నం ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అధ్యక్షుడు ఆశీర్వాదం హామీ ఇచ్చారు. ఏఈఎల్​సీ చర్చి అంతర్గత గొడవలు పెరుగుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. గతంలో కూడా పాత పొన్నూరు ఏఈఎల్​సీ చర్చి పాస్టర్ల బదిలీ విషయమై పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగి.. వారాలు తరబడి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.