ETV Bharat / state

దళితుల భూమిలపై... వైఎస్సార్​సీపీ నేతల దౌర్జన్యం..!

author img

By

Published : Feb 8, 2023, 9:55 AM IST

Dalits land encroach: మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామంలో వైఎస్సార్​సీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళితుల పొలంపై కన్నేసిన స్థానిక వైఎస్సార్​సీపీ నాయకులు.. సోమవారం దౌర్జన్యంగా నిమ్మ మొక్కలు పీకేసి.. పూరిపాకకు నిప్పు పెట్టారని బాధితులు వెల్లడించారు. దౌర్జన్యం చేసి, తమ భూమి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

సీఎం సొంత జిల్లాలో పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల దౌర్జన్యాలు

Dalits land encroach in AP: సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్​సీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామంలో దళితులు నాలుగు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటుండగా.. వైఎస్సార్​సీపీ నేతలు వారి నిమ్మ మొక్కల్నితొలగించారు. తమ పొలాన్ని బలవంతంగా లాక్కోవడానికి యత్నిస్తున్నారన్న బాధితులకు.... తెలుగుదేశం అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.

జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. మైదుకూరు మండలం జాండ్లవరంలో దళితుడైన సంబటూరు వెంకట సుబ్బయ్య తన పేరిట ఉన్న 5 ఎకరాల డీకేటీ పొలాన్ని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మరణానంతరం ఆ భూమిలో ఆయన కుమారుడు రాజా నిమ్మ మొక్కలు నాటారు. ఈ పొలంపై కన్నేసిన స్థానిక వైఎస్సార్​సీపీ నాయకులు.. సోమవారం దౌర్జన్యంగా నిమ్మ మొక్కలు పీకేసి.. పూరిపాకకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.

'ఈ భూమీ మా తండ్రిగారి పేరు మీద ఉంది ఈ భూమి మెుత్తం ఐదు ఎకరాలు. మేము ఈ భూమిలో నిమ్మ మెుక్కలు పెట్టుకున్నాం. వైఎస్సార్​సీపీ నేతలు మాపై నిన్న దాడిచేశారు. మేము పెట్టిన నిమ్మ మెుక్కలను మెుత్తం స్వాధీనం చేసుకున్నారు. మాపై దాడి చేసేందుకు వైఎస్సార్​సీపీ నేతలు ట్రాక్టర్​లో జనాలను తీసుకువచ్చారు. భూమిపై హక్కు లేదంటున్నారు. తూపల్లి రఘు, నర్సీంహా రెడ్డి, వెంకటయ్యలతోపాటు మెుత్తం 50 మంది వచ్చారు. మా తమ్ముడిపై దాడి చేసేందుకు వచ్చారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.'- సంబటూరు రాజా, అనసూయ, దళిత రైతు

దాదాపు 50 మంది వైఎస్సార్​సీపీ నాయకులు మరణాయుధాలతో వచ్చి దౌర్జన్యం చేశారని, భూమి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొలం తప్ప తమకు దిక్కులేదని, చావే శరణ్యమని లబోదిబోమంటున్నారు.

తెలుగుదేశం నేత పుట్టా సుధాకర్ యాదవ్ దళితుల భూములను పరిశీలించారు. మైదుకూరు ఎమెల్యే రఘురామిరెడ్డి అనుచరులే భూములు లాక్కోవడానికి ఈ ఘటనకు పాల్పడ్డారని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల వైఖరిని తప్పు పట్టిన ఆయన.. న్యాయపోరాటంలో బాధితులకు అండగా ఉంటామన్నారు.

' భూముల ధరలు పెరగడంతో వైఎస్సార్​సీపీ నేతల కన్ను ఈ భూమిపై పడింది. అందుకోసమే ఈ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దళిత రైతుల నుంచి మైదుకూరు ఎమెల్యే రఘురామిరెడ్డి అనుచరులే భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అనుకులంగా ఉన్న వారికి ఈ భూని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తరఫున బాధితులకు అండగా ఉంటాము. వారికి కావలసిన న్యాయ సహాయం చేస్తాం.'- పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ నేత

ఇవీ చదవండి:

సీఎం సొంత జిల్లాలో పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల దౌర్జన్యాలు

Dalits land encroach in AP: సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్​సీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామంలో దళితులు నాలుగు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటుండగా.. వైఎస్సార్​సీపీ నేతలు వారి నిమ్మ మొక్కల్నితొలగించారు. తమ పొలాన్ని బలవంతంగా లాక్కోవడానికి యత్నిస్తున్నారన్న బాధితులకు.... తెలుగుదేశం అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.

జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. మైదుకూరు మండలం జాండ్లవరంలో దళితుడైన సంబటూరు వెంకట సుబ్బయ్య తన పేరిట ఉన్న 5 ఎకరాల డీకేటీ పొలాన్ని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మరణానంతరం ఆ భూమిలో ఆయన కుమారుడు రాజా నిమ్మ మొక్కలు నాటారు. ఈ పొలంపై కన్నేసిన స్థానిక వైఎస్సార్​సీపీ నాయకులు.. సోమవారం దౌర్జన్యంగా నిమ్మ మొక్కలు పీకేసి.. పూరిపాకకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.

'ఈ భూమీ మా తండ్రిగారి పేరు మీద ఉంది ఈ భూమి మెుత్తం ఐదు ఎకరాలు. మేము ఈ భూమిలో నిమ్మ మెుక్కలు పెట్టుకున్నాం. వైఎస్సార్​సీపీ నేతలు మాపై నిన్న దాడిచేశారు. మేము పెట్టిన నిమ్మ మెుక్కలను మెుత్తం స్వాధీనం చేసుకున్నారు. మాపై దాడి చేసేందుకు వైఎస్సార్​సీపీ నేతలు ట్రాక్టర్​లో జనాలను తీసుకువచ్చారు. భూమిపై హక్కు లేదంటున్నారు. తూపల్లి రఘు, నర్సీంహా రెడ్డి, వెంకటయ్యలతోపాటు మెుత్తం 50 మంది వచ్చారు. మా తమ్ముడిపై దాడి చేసేందుకు వచ్చారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.'- సంబటూరు రాజా, అనసూయ, దళిత రైతు

దాదాపు 50 మంది వైఎస్సార్​సీపీ నాయకులు మరణాయుధాలతో వచ్చి దౌర్జన్యం చేశారని, భూమి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొలం తప్ప తమకు దిక్కులేదని, చావే శరణ్యమని లబోదిబోమంటున్నారు.

తెలుగుదేశం నేత పుట్టా సుధాకర్ యాదవ్ దళితుల భూములను పరిశీలించారు. మైదుకూరు ఎమెల్యే రఘురామిరెడ్డి అనుచరులే భూములు లాక్కోవడానికి ఈ ఘటనకు పాల్పడ్డారని మండిపడ్డారు. అధికారులు, పోలీసుల వైఖరిని తప్పు పట్టిన ఆయన.. న్యాయపోరాటంలో బాధితులకు అండగా ఉంటామన్నారు.

' భూముల ధరలు పెరగడంతో వైఎస్సార్​సీపీ నేతల కన్ను ఈ భూమిపై పడింది. అందుకోసమే ఈ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దళిత రైతుల నుంచి మైదుకూరు ఎమెల్యే రఘురామిరెడ్డి అనుచరులే భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అనుకులంగా ఉన్న వారికి ఈ భూని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తరఫున బాధితులకు అండగా ఉంటాము. వారికి కావలసిన న్యాయ సహాయం చేస్తాం.'- పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.