ETV Bharat / state

కడప కలెక్టరేట్​లో ఇంకుడు గుంతలు

కడప కలెక్టరేట్​లో ఇంకుడుగుంతల నిర్మాణానికి శుంకస్థాపన చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ అధికారి సురేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

author img

By

Published : Aug 22, 2019, 10:00 AM IST

ఇంకుడు గుంతలకుశంకుస్థాపన చేస్తున్న కలెక్టర్

కడప కలెక్టరేట్​లో 18 లక్షల 50 వేల రూపాయలతో ఇంకుడు గుంతల నిర్మాణానికి కలెక్టర్ హరికిరణ్ శంకుస్థాపన చేశారు.జిల్లా మినరల్ ఫండ్ నిధులతో కలెక్టరేట్​ భవనాలపై పడే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసే విధంగా ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 5 ఇంకుడు గుంతల నిర్మాణాల ద్వారా ఏడాదికి 4728 క్యూబిక్ మీటర్ల నీటిని రీచార్జ్ చేసి భూమిలోకి పంపవచ్చని అధికారులు వివరించారు. ఏడాదికి 91 లక్షల లీటర్ల నీటిని ఇంకింప జేయవచ్చని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. అనంతరం జిల్లాలోని 13 మండలాల్లో అమలవుతున్న జలశక్తి అభియాన్ పథకం తీరు తెన్నులను కేంద్ర నోడల్ అధికారి సురేశ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం పక్కాగా అమలు చేయడానికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. భూమి మీద పడే వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి

కడప కలెక్టరేట్​లో 18 లక్షల 50 వేల రూపాయలతో ఇంకుడు గుంతల నిర్మాణానికి కలెక్టర్ హరికిరణ్ శంకుస్థాపన చేశారు.జిల్లా మినరల్ ఫండ్ నిధులతో కలెక్టరేట్​ భవనాలపై పడే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసే విధంగా ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 5 ఇంకుడు గుంతల నిర్మాణాల ద్వారా ఏడాదికి 4728 క్యూబిక్ మీటర్ల నీటిని రీచార్జ్ చేసి భూమిలోకి పంపవచ్చని అధికారులు వివరించారు. ఏడాదికి 91 లక్షల లీటర్ల నీటిని ఇంకింప జేయవచ్చని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. అనంతరం జిల్లాలోని 13 మండలాల్లో అమలవుతున్న జలశక్తి అభియాన్ పథకం తీరు తెన్నులను కేంద్ర నోడల్ అధికారి సురేశ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం పక్కాగా అమలు చేయడానికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. భూమి మీద పడే వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి

పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ

Intro:Ap_Vja_21_21_Gowsala_Pratyaka_Pujalu_av_Ap10052
Sai_ 9849803586

యాంకర్ : విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గో సంరక్షణ కేంద్రంలో గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు.. ఇటీవల జరిగిన గోవుల మృతి దుర్ఘటన విచారకరమని వాటి మృతి పరిహార దోషాలు పోవటానికి గోశాలలో ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శివ స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోశాలను ప్రభుత్వం వన్ పర్యవేక్షించి సంరక్షకులకు తోడ్పాటును అందించాలని, వాటి ఇ ఆలనా పాలన కు ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని శివస్వామి కోరారు. గోవుల మృతి ఘటనపై నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ఇ వాటి మృతిపై ఉన్న అపోహలను పోగొట్టాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు..
బైట్: శివ స్వామి _గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి..


Body:Ap_Vja_21_21_Gowsala_Pratyaka_Pujalu_av_Ap10052


Conclusion:Ap_Vja_21_21_Gowsala_Pratyaka_Pujalu_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.