ETV Bharat / state

కడపలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి - దువ్వూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కడప జిల్లాలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఘటనలో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

three people died in accidents occured at kadapa district
కడపలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
author img

By

Published : Mar 30, 2021, 12:45 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లె వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. కృష్ణంపల్లిలో జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

కృష్ణంపల్లె సమీప గ్రామం కానగూడూరుకు చెందిన రామయ్యగిరి అక్కడికక్కడే మృతి చెందగా.. కమలాపురానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పులివెందులలో ట్రాక్టర్ బోల్తా

కడప జిల్లా పులివెందులలో ఇనుప కడ్డీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ అధిక లోడు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి:

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లె వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. కృష్ణంపల్లిలో జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

కృష్ణంపల్లె సమీప గ్రామం కానగూడూరుకు చెందిన రామయ్యగిరి అక్కడికక్కడే మృతి చెందగా.. కమలాపురానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పులివెందులలో ట్రాక్టర్ బోల్తా

కడప జిల్లా పులివెందులలో ఇనుప కడ్డీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ అధిక లోడు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి:

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.