ETV Bharat / state

బంధువులను పరామర్శించడానికి వెళ్తే.. ఇంటిని లూఠీ చేశారు!

author img

By

Published : Jun 1, 2021, 4:50 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించడానికి ఓ కుటుంబం వెళ్లగా.. దొంగలు వారి ఇంటిని లూఠీ చేశారు. ఏడు తులాల బంగారం , మూడు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.

theft in kadapa
కడపలో దొంగతనం

కడపలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు.. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించడానికి నెలరోజుల క్రితం( ఏప్రిల్ 31న) హైదరాబాద్ వెళ్లగా.. వారింట్లో దొంగలు పడ్డారు. ఏడు తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వారు మే31న(సోమవారం) వచ్చి చూడగా ఇంట్లో సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కడపలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు.. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించడానికి నెలరోజుల క్రితం( ఏప్రిల్ 31న) హైదరాబాద్ వెళ్లగా.. వారింట్లో దొంగలు పడ్డారు. ఏడు తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వారు మే31న(సోమవారం) వచ్చి చూడగా ఇంట్లో సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గంజాయి ముఠా గుట్టు రట్టు.. పరారీలో ప్రధాన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.