కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టివీడులో కుమార్తె మరణవార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఎగువగొట్టివీడుకు చెందిన మాజీ విఆర్వో సుభహాన్. కుమార్తె (30)కు రాయచోటి పట్టణం మాసాపేటలో వివాహం చేశారు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉండగా ఇటీవల తల్లిగారింటికి వచ్చిందని బంధువులు పేర్కొన్నారు. ఆమె ఇంటి వద్ద ఉన్న పలంగా నేలకూలింది. వెంటనే ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె పరిస్థితి చూసిన ఆమె తండ్రి సుభహాన్(65) తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.
గాలివీడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. రాయచోటకి వెళ్ళిన కుమార్తె గుండెపోటుతో మరణించిన సమాచారం తండ్రికి చేరింది. మరుక్షణమే ఆసుపత్రిలో ఆయన కూడా తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడని బంధువులు పేర్కొన్నారు. గ్రామంలో తండ్రీకుమార్తెల మరణ వార్త దావానంలా విస్తరించింది. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి వివేకా హత్యకేసు: సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ