ETV Bharat / state

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత - RAYALASEEMA DHARMAL POWER PROJECT NEWS IN KADAPA DISTRICT

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే అడ్డగించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Nov 9, 2020, 12:29 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ జేఏసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డగించడం సరికాదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీజెన్కో ద్వారా చేపట్టాలని కోరారు. టెంట్లలో కాకుండా కింద కూర్చుని నిరసన తెలపాలని పోలీసులు చెప్పడంతో వాతావరణం సద్దుమణిగింది.

కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ జేఏసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డగించడం సరికాదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీజెన్కో ద్వారా చేపట్టాలని కోరారు. టెంట్లలో కాకుండా కింద కూర్చుని నిరసన తెలపాలని పోలీసులు చెప్పడంతో వాతావరణం సద్దుమణిగింది.

ఇవీ చదవండి

కలెక్టరు ఆదేశం.. తహసీల్దార్లు అప్రమత్తం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.