ప్రమాణ స్వీకారం రోజు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్మోహన్రెడ్డి ఏడాది గడవకముందే ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. లాక్డౌన్ తరువాత వచ్చిన 3 నెలల కరెంటు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ... కడపలోని తన స్వగృహంలో 12 గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చారని ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ప్రజలు అల్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే జగన్కు ఇదే ఆఖరి పాలన అని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: కొండలో యువకుడి మృతదేహం..హత్యా? ఆత్మహత్య ?