ETV Bharat / state

Badvel By-Poll: బద్వేలులో ఉప ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన కె. విజయానంద్‌

author img

By

Published : Oct 21, 2021, 8:57 PM IST

Updated : Oct 22, 2021, 12:57 AM IST

బద్వేలు ఉప ఎన్నిక... స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఎన్నికల అధికారులు(State Election Officer Vijayanand on Badvel ByPoll) తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తరహా ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.

State Election Officer Vijayanand on Badvel ByPoll
బద్వేలులో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి

ఈ నెల 30న జరిగే కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్‌(State Election Officer Vijayanand on Badvel ByPoll) పరిశీలించారు. బద్వేలులో కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నిక నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ చెప్పారు. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. 3 వేల మంది పోలీసులతో పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనల దృష్ట్యా ఈసారి బయటి వ్యక్తుల్ని నియోజకవర్గంలో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచే సైలెన్స్‌ పీరియడ్ ఉంటుందని చెప్పారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను జారీ చేసిందని..... వాటిని పక్కాగా పాటించాలని కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు రాజకీయ పార్టీలను కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు..

బద్వేలు ఉప ఎన్నిక(Badvel ByPoll)లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఓటరు చైతన్యంపై అవగాహన కల్పించే పోస్టర్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్‌ ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

Spandana Video Conference: అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు: సీఎం జగన్

ఈ నెల 30న జరిగే కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్‌(State Election Officer Vijayanand on Badvel ByPoll) పరిశీలించారు. బద్వేలులో కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నిక నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ చెప్పారు. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. 3 వేల మంది పోలీసులతో పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనల దృష్ట్యా ఈసారి బయటి వ్యక్తుల్ని నియోజకవర్గంలో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి విజయానంద్ తెలిపారు. పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచే సైలెన్స్‌ పీరియడ్ ఉంటుందని చెప్పారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను జారీ చేసిందని..... వాటిని పక్కాగా పాటించాలని కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు రాజకీయ పార్టీలను కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు..

బద్వేలు ఉప ఎన్నిక(Badvel ByPoll)లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఓటరు చైతన్యంపై అవగాహన కల్పించే పోస్టర్లను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్‌ ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

Spandana Video Conference: అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు: సీఎం జగన్

Last Updated : Oct 22, 2021, 12:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.