కడప జిల్లాలో ఆర్ ఎక్స్ 100 కథానాయికి పాయల్ సందడి చేసింది. ప్రొద్దుటూరు పట్టణానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో రవితేజ, నాగార్జునతో సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఎదిగే మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. అభిమానులతో స్వీయ చిత్రాలు తీసుకుని అందరినీ అలరించారు. అభిమాన తారను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)