ETV Bharat / state

రాజంపేటలో ముసుగు దొంగల హల్​చల్​

గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లా రాజంపేటలో ముసుగు దొంగలు తిరుగుతున్నారు.

author img

By

Published : Sep 14, 2019, 11:26 PM IST

రాజంపేటలో ముసుగు దొంగల హల్​చల్​

కడప జిల్లా రాజంపేటలో ముసుగు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా రాజంపేట సరస్వతిపురంలో అర్ధరాత్రి ముసుగు ధరించి ఇంటి బీగాలను తొలగించే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలు అప్రమత్తం అయినందున ఎవరికీ చిక్కకుండా పరారయ్యారు. తాజాగా రాజంపేట బైపాస్​లో రైల్వేకోడూరు మార్గంలోని టైల్స్ విక్రయించే మూడు దుకాణాల్లో చొరబడ్డారు. ఎవరూ గుర్తు పట్టని విధంగా ముఖానికి ముసుగులు ధరించి చేతులకు గ్లౌజులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ ఓ దుకాణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

రాజంపేటలో ముసుగు దొంగల హల్​చల్​

కడప జిల్లా రాజంపేటలో ముసుగు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా రాజంపేట సరస్వతిపురంలో అర్ధరాత్రి ముసుగు ధరించి ఇంటి బీగాలను తొలగించే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలు అప్రమత్తం అయినందున ఎవరికీ చిక్కకుండా పరారయ్యారు. తాజాగా రాజంపేట బైపాస్​లో రైల్వేకోడూరు మార్గంలోని టైల్స్ విక్రయించే మూడు దుకాణాల్లో చొరబడ్డారు. ఎవరూ గుర్తు పట్టని విధంగా ముఖానికి ముసుగులు ధరించి చేతులకు గ్లౌజులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ ఓ దుకాణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైయ్యాయి. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

రాజంపేటలో ముసుగు దొంగల హల్​చల్​

ఇదీ చదవండి :

కడప జిల్లాలో పక్కదారి పట్టిన ఉలవలు!

Intro:రూ.1.40 కోట్ల విలువ చేసే మేత పోరంబోకు భూమి ఆక్రమణ


Body:ఉదయగిరి మండలం జి చెర్లో పల్లి గ్రామం వద్ద రూ.1.40 కోట్లు విలువ చేసే మేత పోరంబోకు భూమి పై గ్రామానికి చెందిన కొందరు రాజకీయ పెద్దలు కన్నుపడింది. భూమిని ఆక్రమించేందుకు జెసిబి యంత్రాలను ఏర్పాటు చేసి భూమిని చదును చేస్తున్నారు. ఇప్పటికే కొందరు మేత పోరంబోకు భూమిలో ఉన్న చెట్లను తొలగించి కంపెనీ హద్దు గా ఏర్పాటు చేసుకున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవిన్యూ అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి గ్రామానికి చేరుకొని భూ ఆక్రమణ జరగకుండా అడ్డుకున్నారు.
70 ఎకరాలు ఆక్రమణ...
జి చెరువుపల్లి రెవిన్యూ గ్రామం పరిధిలోని జి చెర్లోపల్లి గ్రామం వద్ద సర్వే నెంబర్ 250 లో 441.14 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉంది. సాగుకు పనికి వచ్చే భూమి కావడం, భూమి ఎకరం ధర రూ.2 రెండు లక్షల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కులు భూమిపై కన్నేశారు. ఇప్పటికే రూ. 1.40 కోట్ల విలువ చేసే 70 ఎకరాల భూమిని ఆక్రమించి భూమిలో ఉన్న చెట్ల ను తొలగించి చదును చేశారు. సమాచారం తెలుసుకున్న తాసిల్దార్ ప్రసాద్ విఆర్వో లతో కలసి జి చెర్లోపల్లి గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడారు. పశువుల మేత కోసం కేటాయించిన భూమి కావడంతో ఎవరైనా ఆ క్రమంలో చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Conclusion:బైట్ : ప్రసాద్, తహసీల్దార్, ఉదయగిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.