ETV Bharat / state

'రహదారి నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు' - కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల వార్తలు

కడప జిల్లా కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 32వ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాయింట్ కలెక్టర్ గౌతమి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో ఏడాదికి 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.

Road Safety awareness
ఎలాంటి ప్రమాదాలు జరగవు
author img

By

Published : Jan 18, 2021, 5:16 PM IST

మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి అన్నారు. కరోనా కారణంగా 500మంది చనిపోతే.. రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో ఏడాదికి 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 32వ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అతివేగం వల్ల కలిగే కష్ట, నష్టాలను సీడీ రూపంలో ప్రజలకు చూపించారు. నెల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.

మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి అన్నారు. కరోనా కారణంగా 500మంది చనిపోతే.. రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో ఏడాదికి 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 32వ రహదారి భద్రతా వారోత్సవాలను ప్రారంభించి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అతివేగం వల్ల కలిగే కష్ట, నష్టాలను సీడీ రూపంలో ప్రజలకు చూపించారు. నెల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.