ETV Bharat / state

బీభత్సం సృష్టించిన లారీ... డ్రైవర్ మృతి

కడప జిల్లా ముద్దనూరు గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. మార్గమధ్యంలో గేర్ రాడ్ ఊడిపోవటంతో సమీపంలోని రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Nov 12, 2020, 3:54 PM IST

బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి
బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి
బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి

కడప జిల్లా మైలవరంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లోడ్​తో వెళ్తున్న ఓ లారీ.. జమ్మలమడుగు-ముద్దనూరు వద్ద ఘాట్ దిగుతున్న సమయంలో గేర్ రాడ్ ఊడిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులేసు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

కడప 30వ ఎన్​సీసీ బెటాలియన్​ను సందర్శించిన డీడీజీ కృష్ణన్

బీభత్సం సృష్టించిన లారీ...డ్రైవర్ మృతి

కడప జిల్లా మైలవరంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లోడ్​తో వెళ్తున్న ఓ లారీ.. జమ్మలమడుగు-ముద్దనూరు వద్ద ఘాట్ దిగుతున్న సమయంలో గేర్ రాడ్ ఊడిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి రైల్వే గేట్లను ధ్వంసం చేసుకుంటూ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులేసు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

కడప 30వ ఎన్​సీసీ బెటాలియన్​ను సందర్శించిన డీడీజీ కృష్ణన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.