ETV Bharat / state

అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలో పటిష్ఠ భద్రతా చర్యలు - TTD SPECIAL SECURITY ARRANGEMENTS

అలిపిరి - తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత సంచారం - టీటీడీ విజిలెన్స్‌ విభాగం, టీటీడీ అటవీశాఖ పటిష్ఠ చర్యలు

ttd_special_security_arrangements_at_alipiri_path_way
ttd_special_security_arrangements_at_alipiri_path_way (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 1:33 PM IST

TTD Special Security Arrangements at Alipiri Path Way : అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్‌ విభాగం, టీటీడీ అటవీశాఖ పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఇటీవల చిరుత జాడ కన్పించడంతో ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సిబ్బంది నాలుగు బృందాలుగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేస్తున్నారు.

వంద మంది వరకు భక్తుల గుంపు వెంట నలుగురు సిబ్బంది కొంత దూరం వచ్చి మరో బృందం సిబ్బందికి వారి రక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలా నరసింహస్వామి ఆలయం వరకు రక్షణగా వెళ్తున్నారు. సీసీ కెమెరాలు, కెమెరా ట్రాప్‌లలో జంతువులను గుర్తిస్తే వెంటనే అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని వాటిని అటవీ ప్రాంతంలోకి పంపే ఏర్పాట్లు ఉన్నాయి.

సమన్వయంతో గస్తీ : భక్తులు జంతువుల దాడులకు గురికాకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అటవీశాఖ ఫారెస్ట్‌ రేంజర్​ శ్రీనివాస్​ తెలిపారు. విజిలెన్స్‌ సిబ్బంది సమన్వయంతో నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

TTD Special Security Arrangements at Alipiri Path Way : అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్‌ విభాగం, టీటీడీ అటవీశాఖ పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఇటీవల చిరుత జాడ కన్పించడంతో ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సిబ్బంది నాలుగు బృందాలుగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేస్తున్నారు.

వంద మంది వరకు భక్తుల గుంపు వెంట నలుగురు సిబ్బంది కొంత దూరం వచ్చి మరో బృందం సిబ్బందికి వారి రక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలా నరసింహస్వామి ఆలయం వరకు రక్షణగా వెళ్తున్నారు. సీసీ కెమెరాలు, కెమెరా ట్రాప్‌లలో జంతువులను గుర్తిస్తే వెంటనే అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని వాటిని అటవీ ప్రాంతంలోకి పంపే ఏర్పాట్లు ఉన్నాయి.

సమన్వయంతో గస్తీ : భక్తులు జంతువుల దాడులకు గురికాకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అటవీశాఖ ఫారెస్ట్‌ రేంజర్​ శ్రీనివాస్​ తెలిపారు. విజిలెన్స్‌ సిబ్బంది సమన్వయంతో నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ దంపతులు

తిరుమలకు పెరిగిన భక్తులు - అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.