ETV Bharat / state

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

author img

By

Published : Aug 28, 2020, 7:46 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీ శాఖ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

red sandle smugling in balapalle forest in kadapa district
19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీ శాఖ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. దీని గురించి డీఎస్పీ వెంకటయ్య వివరాలు తెలియజేశారు.

'మాకు అందిన సమాచారంతో గురువారం రాత్రి బాలపల్లి రేంజ్​లో కూంబింగ్ నిర్వహించాం. నెమళ్లగుట్ట సమీపంలోని మామిడి తోటలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు దుంగలను తీసుకెళుతూ కనిపించారు. మేం దాడిచేయగా దుంగలను వదిలేసి పారిపోయారు. సిగమాల శ్రీనివాసులు అనే ఒక స్మగ్లర్ చిక్కాడు. అతను ఒక పాఠశాల బస్సు డ్రైవర్​గా పనిచేస్తూ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 దుంగలను స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ తెలిపారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లె అటవీ శాఖ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్​ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్​ను అరెస్ట్ చేశారు. దీని గురించి డీఎస్పీ వెంకటయ్య వివరాలు తెలియజేశారు.

'మాకు అందిన సమాచారంతో గురువారం రాత్రి బాలపల్లి రేంజ్​లో కూంబింగ్ నిర్వహించాం. నెమళ్లగుట్ట సమీపంలోని మామిడి తోటలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు దుంగలను తీసుకెళుతూ కనిపించారు. మేం దాడిచేయగా దుంగలను వదిలేసి పారిపోయారు. సిగమాల శ్రీనివాసులు అనే ఒక స్మగ్లర్ చిక్కాడు. అతను ఒక పాఠశాల బస్సు డ్రైవర్​గా పనిచేస్తూ స్మగ్లింగ్​కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 దుంగలను స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి..

అచ్చెన్న కేసు: అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.