కడప జిల్లా రాయచోటికి చెందిన వైకాపా నాయకుడు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. రాయచోటి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆయనను అరా తీశారు. రాంప్రసాద్రెడ్డి గతంలోనూ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెదేపాలో చేరనున్నట్టు పార్టీవర్గాల ద్వాారా తెలిసింది. రాయచోటి నియోజకవర్గంలో తెదేపా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాంప్రసాద్రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: