కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు 14 మందిని తరలించారు. ఇటీవల పట్టణానికి చెందిన 21 మంది రక్త నమూనాలను అధికారులు తిరుపతికి పంపారు. అందులో 7గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ కాగా మిగిలిన 14 మందికి నెగిటివ్ అని తేలింది. ముందస్తు చర్యల్లో భాగంగా నెగిటివ్ వచ్చిన వ్యక్తులను క్వారంటైన్కు తరలించారు. జిల్లా మొత్తంగా క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య 44కు చేరింది.
ఇదీ చూడండి: