ETV Bharat / state

ursu festival in kadapa pedda dargah: నేటినుంచి కడప పెద్ద దర్గా ఉత్సవాలు షురూ..

ursu festival in kadapa pedda dargah: దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేటినుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా మూడో విడత దృష్ట్యా.. ఉరుసు కార్యక్రమాలన్నీ ఏకాంత సేవలోనే నిర్వహించనున్నట్లు.. దర్గా మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.

author img

By

Published : Dec 18, 2021, 3:21 PM IST

pedda dargah ursu festival in kadapa
నేటి నుంచి ప్రారంభం కానున్న కడప పెద్ద దర్గా ఉత్సవాలు


ursu festival in kadapa pedda dargah: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 8గంటలకు.. దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేన్ మాలింగ్ షాను.. పీరి స్థానంలో కూర్చోబెడతారు. ఆయన మూడు రోజుల వరకు అలాగే కదలకుండా కూర్చుంటారు. రాత్రి 10 గంటలకు పీఠాధిపతి తన నివాసం నుంచి గంధం తీసుకొచ్చి.. దర్గా ఆవరణలో చదివింపులు ఇస్తారు.

రేపు ఉరుసు మహోత్సవం నిర్వహిస్తారు. కరోనా మూడో విడత దృష్ట్యా.. 78వ జాతీయ కవి సమ్మేళనం, ఖవాలీ, ఎగ్జిబిషన్ వివిధ రకాల దుకాణాలను రద్దు చేసినట్లు దర్గా మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఉరుసు కార్యక్రమాలన్నీ ఏకాంత సేవలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

దర్గా ఆవరణలో.. కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరిమిత సంఖ్యలోనే ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని.. ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పూల చాదర్ సమర్పించనున్నట్లు మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.


ursu festival in kadapa pedda dargah: కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 8గంటలకు.. దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేన్ మాలింగ్ షాను.. పీరి స్థానంలో కూర్చోబెడతారు. ఆయన మూడు రోజుల వరకు అలాగే కదలకుండా కూర్చుంటారు. రాత్రి 10 గంటలకు పీఠాధిపతి తన నివాసం నుంచి గంధం తీసుకొచ్చి.. దర్గా ఆవరణలో చదివింపులు ఇస్తారు.

రేపు ఉరుసు మహోత్సవం నిర్వహిస్తారు. కరోనా మూడో విడత దృష్ట్యా.. 78వ జాతీయ కవి సమ్మేళనం, ఖవాలీ, ఎగ్జిబిషన్ వివిధ రకాల దుకాణాలను రద్దు చేసినట్లు దర్గా మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఉరుసు కార్యక్రమాలన్నీ ఏకాంత సేవలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

దర్గా ఆవరణలో.. కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరిమిత సంఖ్యలోనే ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని.. ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పూల చాదర్ సమర్పించనున్నట్లు మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.



ఇదీ చదవండి:

Gas Leakage: రిమ్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ గ్యాస్‌ లీక్‌..అప్రమత్తమైన సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.