ETV Bharat / state

badvel by- election: బద్వేలు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఎవరంటే..?

author img

By

Published : Oct 7, 2021, 10:29 AM IST

Updated : Oct 7, 2021, 11:56 AM IST

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్​ పోటీ చేయనున్నారు. భాజపా అభ్యర్థిగా సురేష్‌ను అధిష్ఠానం ఎంపిక చేసినట్లు సోము వీర్రాజు తెలిపారు.

badvel by- election
badvel by- election

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్​ను ఎంపిక చేశారు. భాజపా అభ్యర్థిగా సురేష్‌ను అధిష్ఠానం ఎంపిక చేసినట్లు సోము వీర్రాజు ప్రకటించారు.భాజపా అభ్యర్థి సురేష్‌.. రేపు నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్‌.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్‌ ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు.

అధికార పార్టీ నుంచి సుధ..

దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక (badvel by- election) అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున కమలమ్మ పోటీ చేయనున్నారు. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు (badvel by- election) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేష్​ను ఎంపిక చేశారు. భాజపా అభ్యర్థిగా సురేష్‌ను అధిష్ఠానం ఎంపిక చేసినట్లు సోము వీర్రాజు ప్రకటించారు.భాజపా అభ్యర్థి సురేష్‌.. రేపు నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్‌.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్‌ ఉన్న పేరు ప్రతిష్ఠలు.. ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు.

అధికార పార్టీ నుంచి సుధ..

దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక (badvel by- election) అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున కమలమ్మ పోటీ చేయనున్నారు. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు (badvel by- election) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్

Last Updated : Oct 7, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.