ETV Bharat / state

ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

టైమ్​కి రాకపోతే ఎలా? ఈనాడు పేపర్​లో వచ్చినా స్పందించకపోవటం ఏంటి అంటూ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్​ రెడ్డి కడప జిల్లా ఎర్రగుంట ప్రభుత్వం ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు.

author img

By

Published : Nov 18, 2020, 2:31 PM IST

mla fires on yerragunta govt doctors
ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్​ రెడ్డి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి సమయానికి రాలేదని ఇలా అయితే ఎలా అని వైద్యులను నిలదీశారు. ఆసుపత్రి వెనుక ఉన్న ఆయుష్ రూమ్​లో ఉన్న రోగుల గురించి... ఈనాడు పేపర్​ కథనం వచ్చినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్ రూమ్​లో ఉన్న రోగులకు చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి నుంచే కలెక్టర్ హరికిరణ్​తో ఫోన్​లో మాట్లాడిన ఎమ్మెల్యే... ఆసుపత్రి పనులు త్వరతిగతిన పూర్తి చేసి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఇదీ చదవండి: యోగివేమన విశ్వవిద్యాలయంతో ఎంవోయూ కుదుర్చుకున్న ప్రెస్ అకాడమీ

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్​ రెడ్డి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి సమయానికి రాలేదని ఇలా అయితే ఎలా అని వైద్యులను నిలదీశారు. ఆసుపత్రి వెనుక ఉన్న ఆయుష్ రూమ్​లో ఉన్న రోగుల గురించి... ఈనాడు పేపర్​ కథనం వచ్చినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్ రూమ్​లో ఉన్న రోగులకు చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రి నుంచే కలెక్టర్ హరికిరణ్​తో ఫోన్​లో మాట్లాడిన ఎమ్మెల్యే... ఆసుపత్రి పనులు త్వరతిగతిన పూర్తి చేసి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ప్రభుత్వ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఇదీ చదవండి: యోగివేమన విశ్వవిద్యాలయంతో ఎంవోయూ కుదుర్చుకున్న ప్రెస్ అకాడమీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.