ETV Bharat / state

తుపాను ప్రభావాన్ని కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్

author img

By

Published : Dec 19, 2020, 8:14 AM IST

కడప జిల్లాలో నివర్ తుపాను విజృంభణ గురించి.. కేంద్ర అధ్యయన బృందానికి వివరించారు కలెక్టర్ సి.హరికిరణ్. దెబ్బతిన్న ప్రాజెక్టులు, పాడైన పంటలను.. ఆర్​అండ్​బీ అతిథి గృహంలో పవర్​పాయింట్ ప్రజంటేషన్​ ద్వారా వారికి చూపించారు. అంచనాలకు తగినట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు సహకరించాలని కోరారు.

nivar cyclone effect
కేంద్ర బృందానికి నివర్ తుపాను ప్రభావాన్ని వివరిస్తున్న కలెక్టర్

కేంద్ర బృందానికి నివర్ తుపాను ప్రభావాన్ని వివరిస్తున్న కలెక్టర్

నివర్ తుపాను ప్రభావంతో కడప జిల్లా అన్ని విధాలా నష్టపోయిందని, విశాల హృదయంతో ఆదుకోవాలని.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కేంద్ర అధ్యయన బృందానికి నివేదించారు. జిల్లాలో సంభవించిన వరదలు, నష్టాలు, నష్టపరిహార అంచనా వివరాలను.. ఆర్అండ్​బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు. తుపాను వల్ల మూడు రోజుల్లో దాదాపు 15 సెం.మీల వర్షపాతం నమోదైందని.. ప్రధానంగా రెండు ప్రాజెక్టులు దెబ్బతిని నీరు వృథాగా పోయిందని తెలిపారు. మరో ప్రోజెక్టుకు వచ్చిన వరద ఉద్ధృతికి.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని పేర్కొన్నారు.

భారీ వర్షపాతం నమోదు:

తుపాను ప్రభావంతో జిల్లాలోని 51 మండలాల్లో.. నవంబర్ 25 నుంచి 27 వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. మూడు రోజుల్లోనూ వరుసగా 42.5, 98.4, 16.6 మి.మీ చొప్పున.. మొత్తంగా 157.17 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. 15 మండలాల్లో 10-15, 14 మండలాల్లో 15-20, 13 మండలాల్లో 20-25 సెం.మీల వర్షం కురిసిందని తెలిపారు. 25 సెం.మీ అత్యధిక వర్షపాతం కారణంగా.. రైల్వే కోడూరు మండలంలో వంతెనలు, రహదారులకు అధిక నష్టం జరిగిందన్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయని తెలిపారు.

దెబ్బతిన్న ప్రాజెక్టులు:

జిల్లాలోని పించ, అన్నమయ్య, బుగ్గవంక, వెలిగళ్లు మొదలైన చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపైనా నివర్ ప్రభావం పడిందని హరికిరణ్ తెలిపారు. పించ ప్రాజెక్టు సామర్థ్యం 0.327 టీఎంసీలు కాగా.. నవంబర్ 25న తుఫాను ప్రభావంతో 180 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని చెప్పారు. 26వ తేదీన 5 గంటల వ్యవధిలోనే ఊహించని విధంగా సామర్థ్యానికి మించి ఒక్కసారిగా 1,20,000 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తిందన్నారు. 27వ తేదీన 58,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరగా.. దాదాపు 140 మీటర్ల మేర జలాశయం కుడి వైపు గండి పడిందన్నారు. దీని శాశ్వత పునరుద్ధరణకు రూ.18 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని పేర్కొన్నారు.

పంటలపై ప్రభావం:

సుమారు 1,42,409 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై.. నివర్ తుపాను ప్రభావాన్ని చూపిందని కలెక్టర్ వివరించారు. ఇందులో 1,36,989 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 5,420 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా శనగ, వరి పంటలు ఎక్కువగా నష్టపోయాయన్నారు.

ఇదీ చదవండి:

'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి'

కేంద్ర బృందానికి నివర్ తుపాను ప్రభావాన్ని వివరిస్తున్న కలెక్టర్

నివర్ తుపాను ప్రభావంతో కడప జిల్లా అన్ని విధాలా నష్టపోయిందని, విశాల హృదయంతో ఆదుకోవాలని.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కేంద్ర అధ్యయన బృందానికి నివేదించారు. జిల్లాలో సంభవించిన వరదలు, నష్టాలు, నష్టపరిహార అంచనా వివరాలను.. ఆర్అండ్​బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు. తుపాను వల్ల మూడు రోజుల్లో దాదాపు 15 సెం.మీల వర్షపాతం నమోదైందని.. ప్రధానంగా రెండు ప్రాజెక్టులు దెబ్బతిని నీరు వృథాగా పోయిందని తెలిపారు. మరో ప్రోజెక్టుకు వచ్చిన వరద ఉద్ధృతికి.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని పేర్కొన్నారు.

భారీ వర్షపాతం నమోదు:

తుపాను ప్రభావంతో జిల్లాలోని 51 మండలాల్లో.. నవంబర్ 25 నుంచి 27 వరకు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. మూడు రోజుల్లోనూ వరుసగా 42.5, 98.4, 16.6 మి.మీ చొప్పున.. మొత్తంగా 157.17 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. 15 మండలాల్లో 10-15, 14 మండలాల్లో 15-20, 13 మండలాల్లో 20-25 సెం.మీల వర్షం కురిసిందని తెలిపారు. 25 సెం.మీ అత్యధిక వర్షపాతం కారణంగా.. రైల్వే కోడూరు మండలంలో వంతెనలు, రహదారులకు అధిక నష్టం జరిగిందన్నారు. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయని తెలిపారు.

దెబ్బతిన్న ప్రాజెక్టులు:

జిల్లాలోని పించ, అన్నమయ్య, బుగ్గవంక, వెలిగళ్లు మొదలైన చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపైనా నివర్ ప్రభావం పడిందని హరికిరణ్ తెలిపారు. పించ ప్రాజెక్టు సామర్థ్యం 0.327 టీఎంసీలు కాగా.. నవంబర్ 25న తుఫాను ప్రభావంతో 180 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని చెప్పారు. 26వ తేదీన 5 గంటల వ్యవధిలోనే ఊహించని విధంగా సామర్థ్యానికి మించి ఒక్కసారిగా 1,20,000 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తిందన్నారు. 27వ తేదీన 58,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరగా.. దాదాపు 140 మీటర్ల మేర జలాశయం కుడి వైపు గండి పడిందన్నారు. దీని శాశ్వత పునరుద్ధరణకు రూ.18 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని పేర్కొన్నారు.

పంటలపై ప్రభావం:

సుమారు 1,42,409 హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై.. నివర్ తుపాను ప్రభావాన్ని చూపిందని కలెక్టర్ వివరించారు. ఇందులో 1,36,989 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 5,420 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా శనగ, వరి పంటలు ఎక్కువగా నష్టపోయాయన్నారు.

ఇదీ చదవండి:

'గురుప్రతాప్‌రెడ్డి హత్య.. నిగ్గు తేల్చాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.