ETV Bharat / state

దారుణం.. అనుమానంతో భార్యను చంపి పూడ్చిపెట్టిన భర్త

author img

By

Published : Aug 22, 2020, 7:15 PM IST

భార్యపై అనుమానంతో భర్తే ఆమెను చంపేసి పూడ్చిపెట్టిన ఘటన కడప జిల్లా పులివెందులలో కలకలం సృష్టించింది. పోలీసుల విచారణలో తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

husband murdered wife in pulivendula kadapa district
అనుమానంతో భార్యను చంపి పూడ్చిపెట్టిన భర్త

కడప జిల్లా పులివెందులలో అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన వీరమ్మకు పులివెందుల రోటరీపురానికి చెందిన అశోక్​కు 3 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు అశోక్.

ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు పెద్దమనుషుల పంచాయతీ జరిగింది. అయినా మారని అశోక్ 3 రోజుల క్రితం భార్యను చంపి శిల్పారామం సమీపంలో పూడ్చిపెట్టాడు. వీరమ్మ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్​ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. తానే చంపి పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.

కడప జిల్లా పులివెందులలో అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన వీరమ్మకు పులివెందుల రోటరీపురానికి చెందిన అశోక్​కు 3 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు అశోక్.

ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు పెద్దమనుషుల పంచాయతీ జరిగింది. అయినా మారని అశోక్ 3 రోజుల క్రితం భార్యను చంపి శిల్పారామం సమీపంలో పూడ్చిపెట్టాడు. వీరమ్మ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్​ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. తానే చంపి పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.

ఇవీ చదవండి:

వ్యవసాయ ప్రత్యేకం.. సేంద్రీయ సాగుతో అధిక దిగుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.