ETV Bharat / state

సోమశిల వెనక జలాలతో ప్రజల ఇక్కట్లు - కడపలో వరద

సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో... కడప జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

సోమశిల వెనక జలాలతో ఇక్కట్లు
author img

By

Published : Nov 1, 2019, 5:17 PM IST

సోమశిల వెనక జలాలతో ఇక్కట్లు

సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో... కడప జిల్లాలోని గోపవరం, అట్లూరి మండలాల పరిధిలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సోమశిల జలాశయంలో 78శాతం నీటిమట్టం నమోదైంది. అందుకే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి తమను పరిస్థితి తెలుసుకోవడానికి రాలేదని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. స్థానిక ఎస్సై లలిత ప్రజలకు మంచినీరు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన

సోమశిల వెనక జలాలతో ఇక్కట్లు

సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో... కడప జిల్లాలోని గోపవరం, అట్లూరి మండలాల పరిధిలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సోమశిల జలాశయంలో 78శాతం నీటిమట్టం నమోదైంది. అందుకే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి తమను పరిస్థితి తెలుసుకోవడానికి రాలేదని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. స్థానిక ఎస్సై లలిత ప్రజలకు మంచినీరు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: సోమశిల ముంపుప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన

Intro:666Body:333Conclusion:సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో కడప జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి .కడప జిల్లాలోని గోపవరం అట్లూరు మండలాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది .బుడ్డి చర్ల, సూరేపల్లి చింటూ వాండ్ల పల్లి, వరి కుంట్ల గ్రామాల చుట్టూ సోమశిల వెనుక జలాలు వచ్చేశాయి .నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం లో 78 పూర్తిస్థాయి నీటిమట్టం నిలువరించడం తో ఈ పరిస్థితి నెలకొంది రెండు రోజులుగా నిద్రాహారాలు లేక ప్రభుత్వ పాఠశాలలు ఎత్తు ప్రదేశాల్లో లోకి వెళ్లి ముంపు బాధితులు తలదాచుకుంటున్నారు . బజ్జీలు గ్రామీణ ఎస్ ఐ లలిత తమ సిబ్బందితో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు .అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .మానవతా దృక్పథంతో వారికి బ్రెడ్ ప్యాకెట్ లు నీటిని అందజేశారు. సోమశిల వెనుక జలాలు చేరడం వల్ల తేళ్ళు పాములు బెడద అధికంగా ఉంది .ఎప్పుడు దాడి చేస్తాయని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంతవరకు వారికి చేయూత అందించేవారు కరవై బాధలు అనుభవిస్తున్నారు . ఇప్పటికైనా పాలకులు తమ పరిస్థితి గమనించి సాయం చేయాలని ఎదురు చూస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.