ETV Bharat / state

కరోనాతో మరణించిన వారి పిల్లలకు రూ. 10 లక్షల సాయం అందజేత - కరోనాతో మరణించిన వారి పిల్లలకు కడపలో ప్రభుత్వం సాయం

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన దంపతుల పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా.. కడప జిల్లాలో బాధిత కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా చెక్కులను పంపిణీ చేశారు.

financial asistance
financial asistance
author img

By

Published : May 29, 2021, 3:38 PM IST


కరోనాతో మరణించిన దంపతుల పిల్లలకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. కడప కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ చెక్కులు అందించారు. ఇప్పటివరకు 3 కుటుంబాలకు సంబంధించిన పిల్లలను గుర్తించి వారికి సహాయాన్ని అందజేశారు.

పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఫిక్స్​డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో ఈ డబ్బు భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. నెలకు వడ్డీ కావాలన్నా తీసుకోవచ్చని, లేదంటే ఒకేసారి కలిపి తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వైయస్సార్ బీమా కాకుండా అదనంగా రూ.10 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు.


కరోనాతో మరణించిన దంపతుల పిల్లలకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. కడప కలెక్టరేట్ లో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరి కిరణ్ చెక్కులు అందించారు. ఇప్పటివరకు 3 కుటుంబాలకు సంబంధించిన పిల్లలను గుర్తించి వారికి సహాయాన్ని అందజేశారు.

పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఫిక్స్​డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో ఈ డబ్బు భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. నెలకు వడ్డీ కావాలన్నా తీసుకోవచ్చని, లేదంటే ఒకేసారి కలిపి తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వైయస్సార్ బీమా కాకుండా అదనంగా రూ.10 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

పై వంతెనపై డివైడర్​ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.