ETV Bharat / state

'సచివాలయాలకు బదలాయించే ప్రక్రియను ఆపేయండి'

author img

By

Published : Mar 31, 2021, 7:32 PM IST

తమను సచివాలయాలకు బదలాయించే ప్రక్రియను నిలిపివేయాలని కడప నగరపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.

dharna in front of kurnool municipal office
కడప నగరపాలక కార్యాలయం ఎదుట కార్మికలు ధర్నా

మున్సిపల్ కార్మికులను సచివాలయాలకు బదలాయించే ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జనాభా ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకం చేపట్టిన తర్వాతనే సచివాలయానికి బదలాయించాలన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల మున్సిపల్ కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ క్రమబద్ధీకరించకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

మున్సిపల్ కార్మికులను సచివాలయాలకు బదలాయించే ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జనాభా ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకం చేపట్టిన తర్వాతనే సచివాలయానికి బదలాయించాలన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల మున్సిపల్ కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ క్రమబద్ధీకరించకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'ఇన్నాళ్లూ మద్యం, ఇసుక మాఫియా చూశాం.. ఇప్పుడు జుట్టు మాఫియా చూస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.